Ekaburu - క్రైమ్ / : స్నేహితురాలి ఇంట్లో బంగారం చోరీ చేసిన తెలుగు సినీ నటిని పోలీసులు అరెస్టు చేశారు. స్నేహితురాలిని నమ్మించి, ఆమే ఇంట్లోకి ప్రవేశించి కిలో బంగారు ఆభరణాలు దొంగతనం చేసింది టాలీవుడ్ నటీ సౌమ్య శెట్టి. రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ కుమార్తె మౌనిక యూట్యూబర్. యూ ట్యూబర్, నటి సౌమ్య శెట్టితో మౌనిక కు పరిచయం అయ్యింది. సౌమ్య శెట్టి తరచూ మౌనిక ఇంటికి వెళ్తుండేది. ఈ క్రమంలో మౌనిక బెడ్ రూమ్ లో ఉంచిన బంగారు ఆభరణాలను గమనించిన సౌమ్య వాటిని చోరీ చేయాలని పథకం వేసింది. ఇంటికి వచ్చిన ప్రతిసారి వాష్ రూమ్ పేరుతో మౌనిక గదిలోకి వెళ్లిన సౌమ్య గదిలో ఉన్న దాదాపు 1కిలో బంగారు ఆభరణాలు చోరీ చేసింది.
Also Read : మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది: రామస్వామి యాదవ్
చోరీ చేసిన బంగారంలో కొంత విక్రయించి తన కుటుంబాన్ని గోవా టూర్ కు తీసుకువెళ్లింది. కాగా ఇంట్లో బంగారం పోవడం గమనించిన మౌనిక కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు. దర్యాప్తులో పోలీసులకు సౌమ్య మీద అనుమానం వచ్చింది. సౌమ్య ఈ మధ్య డబ్బు ఖర్చు చేయడం, కుటుంబాన్ని గోవాకు తీసుకువెళ్లడంతో అనుమానించిన పోలీసులు సౌమ్య ను విచారించారు. విచారణలో పక్కా ప్లాన్ ప్రకారం సౌమ్య శెట్టి ఈ చోరీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు చోరీకి గురైన బంగారంలో కొంత సౌమ్య వద్ద రికవరీ చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. సౌమ్య శెట్టి యూట్యూబర్ గా పాపులర్ కాగా, ద ట్రిప్, యువర్స్ లవింగ్లీ వంటి పలు సినిమాల్లో నటించింది.
Admin
Ekaburu