Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : గతంలో మధ్య నిషేధం ఉన్నప్పుడు మందు బాటిళ్ల స్మగ్లింగ్ చూశాం... విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేయడం చూశాం... గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుమందుల స్మగ్లింగ్ చూస్తున్నాం... కానీ కొత్తగా స్మగ్లర్ల చూపు డీజిల్ మీద పడింది. పక్క రాష్ట్రాల్లో డీజిల్ ధర తక్కువ ఉండడంతో డీజిల్ ను స్మగ్లింగ్ చేసి మన రాష్ట్రంలో అమ్ముతున్నారు. మన పక్కనే ఉన్న కర్ణాటకలో లీటర్ డీజిల్ 86.39 రూపాయల కు దొరుకుతుండగా, తెలంగాణలో మాత్రం లీటర్ డీజిల్ ధర 95.65 ఉంది. దింతో లీటర్ మీద 10 రూపాయలు మిగులుతుండడంతో స్మగ్లర్లు డీజిల్ ట్యాంకర్లను బార్డర్ దాటిస్తున్నారు. ఈ మధ్య కాలంలో డీజిల్ స్మగ్లింగ్ కేసులు పెద్దఎత్తున నమోదవుతున్నాయి. తాజాగా గచ్చిబౌలి పోలీసులు ఓ డీజిల్ స్మగ్లింగ్ ముఠాను అరెస్టు చేసి 10,800 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్నారు.
Also Read : గోపన్ పల్లిలో ఘనంగా కట్ట మైసమ్మ విగ్రహా ప్రతిష్టాపన
కర్ణాటక నుంచి డీజిల్ ట్యాంకర్లను బార్డర్ దాటించి నగరానికి తీసుకువస్తున్న స్మగ్లర్లు, డీజిల్ ను చిన్న చిన్న ట్యాంకర్ల కు మార్చి డోర్ స్టెప్ డెలివరీ ఆన్లైన్ సర్వీసు ద్వారా అడిగిన వారికి, టిప్పర్లు, క్రషర్ల నిర్వాహకులకు సరఫరా చేస్తున్నారు. ఈ స్మగ్లింగ్ దందాపై సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు దాడి చేయగా 7గురు డ్రైవర్లు, 7చిన్న ట్యాంకర్లు దొరకగా, 10,800 లీటర్ల డీజిల్ పట్టుకున్నారు. ఈ ముఠాకు చెందిన 3గ్గురు ప్రధాన నిందితులు తప్పించుకున్నారు. దొరికిన డీజిల్ విలువ 10.36 లక్షలు ఉండగా, 36 లక్షల విలువైన ట్యాంకర్ల ను పోలీసులు పట్టుకున్నారు. పెద్ద ట్యాంకర్లతో కర్ణాటక నుంచి నగరానికి తెచ్చి, వట్టినాగులపల్లిలో చిన్న ట్యాంకర్ల కు మార్చి నగరంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. గచ్చిబౌలి పోలీసులు నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు డీజిల్ స్మగ్లింగ్ ముఠాను పట్టుకోవడం విశేషం.
Admin
Ekaburu