Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీ లో బర్త్ డే పార్టీ ముసుగులో నిర్వహించిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఐటీ కారిడార్ నడిబొడ్డున ఈ పార్టీ బయటపడడం తీవ్ర సంచలనంగా మారింది. పార్టీలో డ్రగ్స్, గంజాయి సేవించినట్లు తెలుస్తుంది. పలువురు ఐటీ ఉద్యోగులు, ప్రముఖులు పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం. ప్రముఖుల్లో సినీ, వ్యాపార రంగాలకు చెందిన వారు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. బర్త్ డే పార్టీ మీద దాడి చేసిన పోలీసులు అందులో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. పార్టీలో పాల్గొన్న వారి దగ్గర నుండి 40 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న పలువురుని పోలీసులు అరెస్టు చేసి నోటీసులు జారీ చేశారు.
Admin
Ekaburu