Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు( ఆర్సీబీ ) ట్రోఫీ చేజిక్కించుకోవడంతో నగరంలో అభిమానులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. కాగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆర్సీబీ అభిమానుల గెలుపు సంబరాలు శృతిమించాయి. హైటెక్ సిటీ పరిధిలోని కొండాపూర్ చౌరస్తా వద్దకు పెద్దఎత్తున చేరుకున్న అభిమానులు సంబరాల్లో మునిగితేలారు. కొందరు అభిమానులు శృతి మించి చేసిన సంబరాలు తోటి ప్రయాణికులకు ఇబ్బందులు సృష్టించాయి. కొండాపూర్ సిగ్నల్ వద్ద దాదాపు 150 మంది యువకులు బాణసంచా కాల్చుతూ, వాహనాలకు దారి వ్వకుండా హాల్ చల్ చేస్తూ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిపోకు చెందిన రూట్ నెంబర్ 10హెచ్ బస్సు(టీజీ10టి1469) సికింద్రాబాద్ నుంచి కొండాపూర్ క్రాస్ రోడ్డుకు చేరుకుంది. అక్కడ బస్సు యూటర్న్ తీసుకోవాల్సి ఉండగా గెలుపు సంబరాలు చేసుకుంటున్న ఆర్సీబీ అభిమానులు రోడ్డుపై తిష్టవేసి బస్సు కు అడ్డు తగిలారు. చాలా సేపు హరన్ కొట్టినా పక్కకు జరగని ఆర్సీబీ అభిమానులు రహదారిపై వాహనాలను ముందుకు కదలినివ్వలేదు. ఇదే సమయంలో మరింత రెచ్చిపోయిన ఇద్దరు గుర్తు తెలియని యువకులు ఆర్టీసీ బస్సు మీదకు ఎక్కి బస్సు ముందుకు కదలకుండా డ్రైవర్ ను అడ్డుకున్నారు..
Also Read : డ్రాగన్ కంట్రీ అగ్రికల్చర్ టెర్రరిజం
రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఆంటంకం కల్గించడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. బాణాసంచా కాల్చుతూ ఆర్సీబీ అభిమానులు వాహనాలకు దారి ఇవ్వకపోవడంతో గ్రీన్ సిగ్నల్ ఉన్నా వాహనాలు ముందుకు కదలేని పరిస్థితి వచ్చింది. అర్టీసీ బస్సు ముందుకు కదలకుండా ఇద్దరు గుర్తు తెలియని యువకులు తన విధులకు ఆటంకం కల్గించారని డ్రైవర్ పోచయ్య గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Admin
Ekaburu