Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : కోవిడ్ వంటి మహమ్మారిని ప్రపంచం మీదకు వదిలి అతలాకుతలం చేసిన డ్రాగన్ దేశం మరో అగ్రికల్చర్ టెర్రరిజానికి ప్రయత్నం చేసిందనే వార్త సంచలనం గా మారింది. అమెరికాలో ఇద్దరు చైనా శాస్త్రవేత్తల అరెస్టు తో డ్రాగన్ దేశం కుయుక్తి బయటకు వచ్చింది. చైనా ల్యాబ్లో డేంజరెస్ వైరస్ సృష్టించిన విషయం వెలుగు చూసింది. ఫుసారియమ్ గ్రామినేరియమ్ అనే ఫంగస్ ను చైనా అభివృద్ధి చేసింది. గోధుమ, బార్లి, మొక్కజొన్న, వరి వంటి పంటలను నాశనం చేసే శీలింధ్రాలను చైనా తయారు చేసింది. అమెరికా యూనివర్సిటీ లో పరిశోధన కోసం ఈ శీలింధ్రాలను తరలిస్తున్న ఇద్దరు చైనా శాస్త్రవేత్తలను అరెస్ట్ చేశారు. యున్కింగ్ జియాన్ (33), జున్యాంగ్ లియు (34) అనే ఇద్దరు చైనా శాస్త్రవేత్తలను ఎయిర్పోర్ట్లో ఎఫ్ బీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మిషిగన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసం శీలింధ్రాలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. డ్రాగన్ కంట్రీ చేసిన ఈ పరిశోధన వ్యవసాయ టెర్రరిజం అంటూ అమెరికా ఆరోపిస్తుంది. ఈ ఫంగస్ కారణంగా మానవులు, పశువులకు హాని జరుగుతుందని, వాంతులు, కాలేయాన్ని దెబ్బతీస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
Admin
Ekaburu