Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలోని రంగ్ లాల్ కుంట చెరువు పూర్వ వైభవం సంతరించుకుంది. ఒకప్పుడు స్వచ్చమైన నీటితో, ఆహ్లాదకర వాతావరణంతో కనువిందు చేసిన చెరువు మద్యలో అభివృద్ధి దెబ్బకు అనవాళ్లు కోల్పోయి అవసాన దశకు చేరింది. ఈ చెరువు చుట్టూ కార్యకలాపాలు చేవడుతున్న ఐటి సంస్థల చూపు రంగ్లల్ కుంట మీద పడడంతో మరోసారి చెరువుకు పునరుజ్జీనం లభించింది. సామాజిక బాధ్యతలో భాగంగా వర్చుసా సాఫ్ట్వేర్ సంస్థ సిఎస్ఆర్ నిధులతో చెరువును సుందరంగా తీర్చిదిద్దింది. దీంతో మరోసారి రంగ్ల్ కుంట చెరువు స్వచ్చమైన నీరు, వచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణంతో స్థానికులకు అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు అభివృద్ధి చేసిన చెరువును బుధవారం తెలంగాణ పిఎసీ చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, గచ్చిబౌలి కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి, టిజిఐఐసి అధికారులు, వర్చుసా సాఫ్ట్వేర్ సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి....
Also Read : ప్రైవేటు హాస్టళ్లలో మకాం వేస్తూ.. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు డ్రగ్స్ విక్రయిస్తూ..
శేరిలింగంపల్లి మండల పరిధిలోని నానక్ రాంగూడ సర్వే నెంబరు 106లో 2.28 ఎకరాల విస్తీర్ణంలో రంగ్ లాల్ కుంట చెరువు ఉండగా, ఎఫ్టీఎల్ తో కలిపి చెరువు విస్తీర్ణం 5.36 ఎకరాల్లో విస్తరించి ఉంది. గతంలో ఈ చెరువు నీటితో చుట్టు ప్రక్కల రైతులు వ్యవసాయం చేశారు. కాగా గచ్చిబౌలి ఐటీ కారిడార్ ఏర్పాటుతో చెరువు చుట్టూ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పుట్టుకురావడంతో చెరువు రానురాను కనుమరుగు దశకు చేరింది. చెరువులో కొంతభాగం కబ్జాలకు గురికాగా, రహదారుల కోసం చెరువు మధ్యలో నుంచి రోడ్డు వేయడం, మురుగు నీరు కలవడం చెరువుకు శావంగా మారింది.
ఒకప్పుడు నిండ నీటితో కళకళలాడిన చెరువు కబ్జాలతో నీటి కుంటగా మారడంతో ఐటి కారీదార్లో ఉన్న వర్చుసా సంస్థ చెరువు పునరుద్ధరణకు ముందుకు వచ్చింది. సామాజిక బాధ్యతలో భాగంగా సిఎస్ఆర్ నిధులతో మిగిలి ఉన్న చెరువును పూర్తిగా అభివృద్ధి చేసింది. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మరోసారి చెరువు కబ్జాకు గురికాకుండా చర్యలు చేపట్టారు. దీంతో పాటు చెరువు చుట్టూ కట్టను ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ ను సుందరంగా తీర్చిదిద్దారు. చెరువులోకి మురుగు నీరు చేరకుండా చర్యలు చేపట్టి ఏడాది పొడవునా స్వచ్ఛమైన వర్షపు నీరు ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. దీని కారణంగా ప్రస్తుతం చెరువులో 24 మిలియన్ లీటర్ల నీరు నిల్వ ఉండి నిండుకుండలా కనిపిస్తుంది. చెరువు కట్ట చుట్టూ గ్రీనరీ. మొక్కలు ఏర్పాటు చేయడంతో వచ్చదనం పరుచుకోగా, ఇక్కడ 14 స్థానిక జాతుల పక్షులు, సీతాకోకచిలుకలు, జంతువులు అవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి. వాకింగ్ ట్రాక్ చుట్టూ రంగురంగుల పూల మొక్కలతో పాటు స్థానికులు సేదతీరేందుకు గెజిబో, పెరోలా, సీటింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. పూర్తిగా అభివృద్ధి చేసిన చెరువును బుధవారం ప్రారంభించి స్థానికులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఐటి కారిడార్లోని ఎత్తైన సాఫ్ట్వేర్ సంస్థల భవనాల మధ్య రంగ్ల్ లాల్ కుంట ప్రస్తుతం సుందరంగా కనిపిస్తుంది.
Admin
Ekaburu