Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం సబ్సిడీ గ్యాస్ సిలిండర్ మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ను సబ్సిడీపై అందజేయనున్నారు. ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారు గత మూడు సంవత్సరాలుగా వినియోగించిన గ్యాస్ సిలిండర్లను పరిగణలోకి తీసుకొని సబ్సిడీ సిలిండర్లను సరఫరా చేయనున్నారు ఇందుకోసం ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు అడ్వాన్సుగా సబ్సిడీ డబ్బును అందజేయనుంది. సిలిండర్ తీసుకునే సమయంలో వినియోగదారులు పూర్తి డబ్బును చెల్లించాల్సి ఉండగా, ఎంపికైన లబ్దిదారులకు 500పైన చెల్లించే డబ్బును తిరిగి వారి అకౌంట్లలో జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక... - రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి జనవరి6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని ఉండాలి. (ప్రజాపాలనలో దరఖాస్తు చేయనివారు అనర్హులు) - తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తెల్ల రేషన్ కార్డు దారులు మాత్రమే అర్హులు. (తెల్ల రేషన్ కార్డు లేని వారు, ప్రజాపాలనలో తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు సైతం అనర్హులు) - లబ్ధిదారుల గ్యాస్ సిలెండర్ కనెక్షన్ విధిగా దరఖాస్తు దారు పేరు మీదే ఉండాలి. (కుటుంబ సభ్యుల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటే అనర్హులు)
Admin
Ekaburu