Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : మూసీ నదిని ఆధారంగా తీసుకుని మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించిన రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) కమిషనర్ గా ఆర్ వి కన్నన్ 2. గ్రేటర్ మల్కాజిగిరి మునిసిపల్ కార్పొరేషన్ (GMMC) కమిషనర్ గా టీ వినయ్ కృష్ణారెడ్డి 3. గ్రేటర్ సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GCMC) కమిషనర్ గా జి సృజన లు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ ల బదిలీలు చేపడుతూ ఉత్తర్వులు జారీ చేసింది వీరితోపాటు రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ లను బదిలీ చేశారు కాగా కొత్తగా ఏర్పడిన మూడు కార్పొరేషన్లకు కలిపి మొత్తం ముగ్గురు మేయర్లు ఉండనున్నారు.
Admin
Ekaburu