Ekaburu - తెలంగాణ / రంగారెడ్డి : శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్ సర్వే నెంబర్ 100, 101లలో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమణ నుంచి కాపాడాలని కోరుతూ జనంకోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ కు పిర్యాదు చేశారు. ప్రభుత్వ భూముల కబ్జాలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారని భాస్కరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కసిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ మియాపూర్ లోని సర్వే నెంబర్ 100, 101లలో ఉన్న ప్రభుత్వ భూములపై 2003 నుండి సుప్రీంకోర్టు స్టెటస్కో ఆదేశాలు ఉన్నాయన్నారు. లోకాయుక్తలో సైతం ఈ భూముల అన్యాక్రాంతంపై 4666/2013/B1 విచారణ జరుగుతుందని, బై నెంబర్లపై 2023 మార్చి 9న స్పష్టమైన ఆదేశాలు జారీచేసి సంబంధిత అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిందని రంగారెడ్డి కలెక్టర్ కు ఆధారాలను అందజేసినట్టు తెలిపారు.
Also Read : మాస్టర్లకు నగదు ప్రోత్సాహకాలు అందజేసిన హోప్ ఫౌండేషన్
సర్వే నెంబర్ 66/A పేరుతో సర్వే నెంబర్ 100,101లోని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని, జీహెచ్ఎంసీ సైతం సదరు కబ్జా భూములకు అనుమతులు మంజూరు చేయడంతో ప్రస్తుతం నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. హెచ్ఎండీఏ ఆధీనంలో ఉన్న సర్వే నెంబర్ 100,101లలోని ప్రభుత్వ భూముల కబ్జాలను అరికట్టి, రక్షించాలని హెచ్ఎండీఏ కమీషనర్ దానకిషోర్ కు, ఐఏఎస్ అమ్రపాలికి, రాజేంద్రనగర్ ఆర్డీఓ, వెస్ట్ జోన్ జోనల్ కమీషనర్, శేరిలింగంపల్లి తహసీల్దార్ లకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ప్రభుత్వ భూముల కబ్జాపై అధికారులు చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టు, లోకాయుక్త దృష్టికి తీసుకెళ్తామని భాస్కరరెడ్డి హెచ్చరించారు.
Admin
Ekaburu