Sunday, 01 March 2026 11:25:05 AM
# జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు # గ్రామంలో ఓటర్లు లేని సామాజిక వర్గానికి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వ్

టెంటు కింద నేతలు... జోరు వానలో ప్రజలు...

ముఖ్యమంత్రి సభలో జనం తిప్పలు

Date : 20 July 2024 01:19 PM Views : 3003

Ekaburu - తెలంగాణ / రంగారెడ్డి : ఓ వైపు జోరు వాన... కూర్చునేందుకు కుర్చీలు దేవుడెరుగు... వానకు తడవకుండా తలదాచుకునే చోటులేకుండా పోయింది. మధ్యాహ్నం 12 గంటలకు అన్న ప్రారంభోత్సవ కార్యక్రమం ఒంటిగంట దాటినా ప్రారంభం కాలేదు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోపన్ పల్లి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రజల కష్టాలు అన్నీఇన్ని కావు. ఓ వైపు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు గ్రూపు తగాదాలతో ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పోటాపోటీగా జనసమీకరణ చేశారు. ప్రారంభోత్సవం కోసం ఏర్పాటు చేసిన రెండు టెంట్లు ఏ మూలకు సరిపోలేదు. జనాన్ని తీసుకువచ్చిన నాయకులకే టెంట్లు సరిపోకపోవడం, సభ ఏర్పాట్లలో అధికారుల వైఫల్యంతో సభకు వచ్చిన జనం వర్షంలో తడిచి ముద్దయ్యారు.

శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంబొత్సవం ఉండగా ఉదయం 11 గంటల నుంచే నాయకులు సభా స్థలి వద్దకు జనాన్ని సమీకరించి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉండగా, ముఖ్యమంత్రి అదే సమయంలో హైటెక్స్ లో నిర్వహించిన కమ్మ సమావేశానికి హాజరు కావడంతో మధ్యాహ్నం 1.30 ఐనా ప్రారంభం కాలేదు. దింతో ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రజలు 2 గంటలుగా వర్షంలో తడుస్తూ నిలబడి ఆపసోపాలు పడ్డారు. ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నాయకుల అత్యుత్సహంతో ప్రజలు భారీగా రావడంతో పోలీసులు సైతం భద్రతా ఏర్పాట్లలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజలతో పాటు వర్షంలో తడుస్తూ ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు ఆపసోపాలు పడ్డారు. ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం కోసం ఏర్పాట్లు చేసిన అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో ఉదయం నుంచే వర్షం ఉండగా, అధికారులు ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహించారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :