Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : చందానగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పోరేటర్, యువమోర్చా రాష్ట్ర నాయకురాలు కసిరెడ్డి సింధూరెడ్డి బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. బిజెవైఎం రాష్ట్ర పూర్తిస్థాయి కమిటీని బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ ప్రకటించగా, శేరిలింగంపల్లికి చెందిన కసిరెడ్డి సింధూరెడ్డిని రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చందానగర్ డివిజన్ బిజెపి అభ్యర్థిగా పోటీచేసి గట్టి పోటీ ఇచ్చిన కసిరెడ్డి సింధూరెడ్డి, అనంతరం పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటు, సోషల్ మీడియా ద్వారా పార్టీ ప్రచారాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తరపున శేరిలింగంపల్లి నియోజకవర్గం మొత్తం పర్యటించి ప్రచారం నిర్వహించారు. బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులైన కసిరెడ్డి సింధు రెడ్డి మాట్లాడుతూ తనను రాష్ట్ర బిజెవైఏం ఉపాధ్యక్షురాలిగా నియమించినందుకు సంతోషంగా ఉందన్నారు. పార్టీకి పనిచేసే అవకాశం కల్పించిన తెలంగాణా రాష్ట్ర రథసారథి గంగాపురం కిషన్ రెడ్డి, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : ఏసీబి వలలో మాదాపూర్ ఎస్ఐ రంజీత్
Admin
Ekaburu