Saturday, 18 April 2026 07:10:27 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కసిరెడ్డి సింధూరెడ్డి

Date : 06 April 2024 04:21 PM Views : 991

Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : చందానగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పోరేటర్, యువమోర్చా రాష్ట్ర నాయకురాలు కసిరెడ్డి సింధూరెడ్డి బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. బిజెవైఎం రాష్ట్ర పూర్తిస్థాయి కమిటీని బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ ప్రకటించగా, శేరిలింగంపల్లికి చెందిన కసిరెడ్డి సింధూరెడ్డిని రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చందానగర్ డివిజన్ బిజెపి అభ్యర్థిగా పోటీచేసి గట్టి పోటీ ఇచ్చిన కసిరెడ్డి సింధూరెడ్డి, అనంతరం పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటు, సోషల్ మీడియా ద్వారా పార్టీ ప్రచారాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తరపున శేరిలింగంపల్లి నియోజకవర్గం మొత్తం పర్యటించి ప్రచారం నిర్వహించారు. బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులైన కసిరెడ్డి సింధు రెడ్డి మాట్లాడుతూ తనను రాష్ట్ర బిజెవైఏం ఉపాధ్యక్షురాలిగా నియమించినందుకు సంతోషంగా ఉందన్నారు. పార్టీకి పనిచేసే అవకాశం కల్పించిన తెలంగాణా రాష్ట్ర రథసారథి గంగాపురం కిషన్ రెడ్డి, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : ఏసీబి వలలో మాదాపూర్ ఎస్ఐ రంజీత్

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :