Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే రెండు కమిషన్లను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలోని పౌర సమాజం ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని అన్నారు. ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ లో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎఎస్సీ ద్వారా నియామకాలు చేపడతామని అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.
Also Read : శిల్పారామంకు పూర్వ వైభవం తీసుకువస్తాం: మంత్రి జూపల్లి
రైతు కమిషన్ వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమనికి సంబంధించిన సలహాలు, సమీక్ష చేపడుతుందన్నారు. రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయబోతున్నామని తెలిపారు. కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, అందరి సూచనలు, సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నామని అన్నారు. రైతు భరోసా అనేది పెట్టుబడి సాయమని, రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని కోరుతున్నామన్నారు.
Admin
Ekaburu