Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మద్యం షాపుల టెండర్లకు చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో 2620 మద్యం షాపులకు మొత్తం 95,285 మంది దరఖాస్తులు చేసుకున్నారు. చివరి రోజున అత్యధికంగా 4,822 దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపులో దరఖాస్తుల ద్వారానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 2,858 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు జిల్లాల కలెక్టర్లు, మద్యం షాపుల దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా తీయనున్నారు. మద్యం షాపుల కోసం వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా రంగారెడ్డిలో 29,420 రాగా, ఆదిలాబాద్లో అత్యల్పంగా 4154 వచ్చాయి.
Also Read : ఇకపై బ్యాంకు అకౌంట్ కు 'నలుగురు' నామినీలు
ప్రాంతాల వారిగా వచ్చిన అత్యధిక, అత్యల్ప దరఖాస్తులను పరిశీలిస్తే శంషాబాద్లో 8536, సరూర్నగర్ 7845, మేడ్చల్ 6063, మల్కాజిగిరి 5168, నల్లగొండ 4906, సంగారెడ్డి 4432, ఖమ్మం 4430, కొత్తగూడెం 3922, హైదరాబాద్ 3201, వరంగల్ అర్బన్ 3175, సికింద్రాబాద్లో 3022, నిజామాబాద్ 2786, సిద్దిపేట 2782, యాదాద్రి భువనగిరి 2776, సూర్యాపేట 2771, కరీంనగర్ 2730, మహబూబ్నగర్ 2487, జగిత్యాల 1966, వరంగల్ రూరల్లో 1958, జయంశంకర్ భూపాల్పల్లి 1863, వికారాబాద్ 1808, మహబూబాబాద్ 1800, జనగామ 1697, మంచిర్యాల 1712, నాగర్కర్నూల్ 1518, పెద్దపల్లి 1507, కామారెడ్డి 1502, రాజన్న సిరిసిల్ల 1381, మెదక్ 1420, నిర్మల్ 991, జోగులాంబ గద్వాల 774, అదిలాబాద్లో 771, వనపర్తి 757, కోమురం భీమ్ ఆసిఫాబాద్లో 680 దరఖాస్తులు వచ్చాయి
Admin
Ekaburu