Sunday, 01 March 2026 11:24:58 AM
# జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు # గ్రామంలో ఓటర్లు లేని సామాజిక వర్గానికి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వ్

మీడియా'తో సంబంధాలు కలిగి ఉండడం నిబంధనల ఉల్లంఘనా..?

తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెండ్

Date : 16 November 2025 06:31 AM Views : 222

Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.. అన్నట్టుగా మారింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్ వివాదాస్పదంగా మారగా సస్పెన్షన్ కు గల కారణాలు విస్తుగొల్పుతున్నాయి. మధ్యాన్న భోజనం'పై ప్రభుత్వ ఉపాద్యాయుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం, స్కూల్ ఆవరణలో ఫోటో, వీడియో తీయడం కారణాలతో పాటు 'ప్రెస్ ' తో సంబంధాలు కలిగి ఉండడం నిబంధనల ఉల్లంఘన, నేరమంటూ.. ప్రభుత్వ ఉపాద్యాయుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గతకొన్ని రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక మధ్యాన్నం భోజన పథకంలో గుడ్డు కొరత వార్త బయటకు వచ్చింది. కాగా శనివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఏంపిపీఎస్ (గర్ల్స్) ఎస్జీటి ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వుల్లో మధ్యాన్నం భోజనం పథకం పై సోషల్ మీడియా లో పోస్టు పెట్టి బెదిరించడంతో పాటు ప్రెస్ తో సంబంధాలు కలిగి ఉండడం నిబంధనల ఉల్లంఘన అంటూ పేర్కొనడం విస్తుగొలుపుతుంది. తెలంగాణ ప్రభుత్వ పథకాల్లోని లోపాలను ఎత్తి చూపితే శ్రీనివాస్‌ను సస్పెండ్ చేయడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read : ఆముదం గింజల నుండి 'రిసిన్' విషం

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :