Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.. అన్నట్టుగా మారింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్ వివాదాస్పదంగా మారగా సస్పెన్షన్ కు గల కారణాలు విస్తుగొల్పుతున్నాయి. మధ్యాన్న భోజనం'పై ప్రభుత్వ ఉపాద్యాయుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం, స్కూల్ ఆవరణలో ఫోటో, వీడియో తీయడం కారణాలతో పాటు 'ప్రెస్ ' తో సంబంధాలు కలిగి ఉండడం నిబంధనల ఉల్లంఘన, నేరమంటూ.. ప్రభుత్వ ఉపాద్యాయుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గతకొన్ని రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక మధ్యాన్నం భోజన పథకంలో గుడ్డు కొరత వార్త బయటకు వచ్చింది. కాగా శనివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఏంపిపీఎస్ (గర్ల్స్) ఎస్జీటి ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వుల్లో మధ్యాన్నం భోజనం పథకం పై సోషల్ మీడియా లో పోస్టు పెట్టి బెదిరించడంతో పాటు ప్రెస్ తో సంబంధాలు కలిగి ఉండడం నిబంధనల ఉల్లంఘన అంటూ పేర్కొనడం విస్తుగొలుపుతుంది. తెలంగాణ ప్రభుత్వ పథకాల్లోని లోపాలను ఎత్తి చూపితే శ్రీనివాస్ను సస్పెండ్ చేయడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : ఆముదం గింజల నుండి 'రిసిన్' విషం
Admin
Ekaburu