Ekaburu - తెలంగాణ / రంగారెడ్డి : చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యుడు, బీజేపీ అగ్రనాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. భారీగా తరలివచ్చిన అభిమానులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు మధ్య కేక్ కట్ చేసిన విశ్వేశ్వరరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అప్పా జంక్షన్ వద్ద గల సంధ్యా గార్డెన్స్ లో నిర్వహించిన విశ్వేశ్వరరెడ్డి జన్మదిన వేడుకలకు దాదాపు 20 వేల మంది హాజరు కాగా, అభిమానులు, కార్యకర్తల ఆట పాటల మధ్య సందడిగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం సైతం విశ్వేశ్వరరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో చదువుల్లో ఉత్తమంగా రాణించిన పేద విద్యార్ధులకు ఆర్థికసాయం అందజేశారు.
విద్యార్థులు, కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. జన్మదిన వేడుకలకు మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్ రత్నం, శేరిలింగంపల్లి బిజెపి అభ్యర్థి రవికుమార్ యాదవ్, రాజేంద్రనగర్ బిజెపి అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి, సామాజికవేత్త సరోజ్ బజాజ్, కొండా కుటుంబ సభ్యులు, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరై విశ్వేశ్వరరెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీద రూపొందించిన ప్రత్యేక పాటను ఆవిష్కరించడంతో పాటు విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయ, సామాజిక జీవితానికి సంబంధించిన వీడియో డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
Admin
Ekaburu