Thursday, 15 January 2026 07:13:37 AM
# శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు # గ్రామంలో ఓటర్లు లేని సామాజిక వర్గానికి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వ్ # కొండాపూర్ లో 'బగ్గా' పై భగ్గుమన్న కాలనీవాసులు # అంజయ్య నగర్ పార్కు కబ్జా అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధం # తాళం పగులగొట్టే పనిలేదు.. డిజిటల్ స్క్రీన్ ల మీదే సర్వం లూఠీ

శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్

కబ్జాకు సహకరించిన సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్

Date : 08 January 2026 01:46 PM Views : 205

Ekaburu - స్పెషల్ స్టోరీస్ / రంగారెడ్డి : హైటెక్ మండలం శేరిలింగంపల్లిలో మరో భారీ భూకబ్జా స్కామ్ బయటపడింది. 50 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ జరిగినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 2వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు స్కెచ్ వేశారు. ఈ భారీ పన్నాగం బయటపడడంతో కబ్జాదారులకు సహకరించిన సబ్ రిజిస్టార్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది దీనితోపాటు సదరు సబ్ రిజిస్టర్ మీద పిడి యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపాలని ఆదేశించింది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మక్తా మహబూబపేటలోని సర్వే నంబరు 44లో ఉన్న 43 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసిన ఓ ముఠా చాలా కాలంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుంది ఇందులో భాగంగా ఈ భూమికి నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి హస్తగతం చేసుకునేందుకు పథకం వేశారు. 58 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ జరిగినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన కబ్జా గ్యాంగ్ వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు పూనుకున్నారు. ఈ కబ్జా గ్యాంగ్ కు నకిలీ డాక్యుమెంట్ సృష్టించడంలో ఓ సబ్ రిజిస్టర్ సహకరించాడు. విషయం తెలిసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్ రిజిస్టార్ ను సస్పెండ్ చేసింది. మక్తా మహబూబ్ పేట భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో జాయింట్ సబ్ రిజిస్టర్-2గా వ్యవహరిస్తున్న కె.మధుసూదన్ రెడ్డిని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు సస్పెండ్ చేశారు. మధుసూదన్ రెడ్డిపై పీడీ యాక్ట్ సైతం నమోదు చేసి జైలుకు పంపాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :