Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బ్యాంకింగ్ చట్టాల సవరణలోని పలు నిబంధనలు ఇప్పటికే అమలులోకి రాగా మరో కీలక నిబంధనను బ్యాంకులు త్వరలో అమలులోకి తీసుకువస్తున్నాయి. ఖాతాదారులకు తమ మరణానంతరం ఖాతాల్లో ఉన్న డబ్బు, బ్యాంకు లాకర్లలో ఉన్న సొత్తుకు సంబంధించి ఇప్పటివరకు నామినీగా ఒక్కరినే ఎంచుకునే అవకాశం ఉంది. బ్యాంకు ఖాతాదారుడు తన అకౌంట్ ఓపెన్ చేసే సమయంలోనే నామినీ వివరాలు పొందుపరుస్తుంటార. కాగా కొన్ని సందర్భాల్లో కుటుంబంలో వారసులు ఎక్కువగా ఉండడంతో పాటు ఖాతాదారుని హక్కుదారులు ఎక్కువగా ఉండి నామినీల విషయంలో వివాదాలు ఏర్పడుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో ఖాతాదారుడు ఇచ్చిన నామిని అంతకంటే ముందే మరణిస్తే ఇబ్బందులు తప్పడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం చేపట్టిన బ్యాంకింగ్ చట్టాల సవరణలో నామినీల సంఖ్యను నాలుగు కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
Also Read : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు
ఇకపై ఖాతాదారుడు అకౌంట్ ప్రారంభ సమయంలోనే నలుగురు నామినీలను ఎంపిక చేసుకొని వారి వివరాలను ఖాతాలో పొందుపరచవచ్చు. ఈ నిబంధన నవంబర్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఖాతాదారుడు అకౌంట్ తెరిచే సమయంలోనే నలుగురు నామినీలను పొందుపరచడంతో పాటు నలుగురికి సమాన హక్కును... లేదా ఎవరికి ఎంత శాతం హక్కు అనే వివరాలను.. నలుగురికి ప్రాధాన్యత క్రమంలో హక్కు వివరాలను పొందుపరిచే వెసులుబాటు అమలులోకి రానుంది. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ నిబంధన బ్యాంకుల్లో అమలులోకి రానున్నట్లు వెల్లడించారు.
Admin
Ekaburu