Saturday, 18 April 2026 07:10:15 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

పైసా పైసా కూడబెట్టి కొన్న ప్లాట్లను కబ్జా చేయాలని చూస్తున్నారు : కొల్లూరు లక్ష్మీపురం కాలనీవాసులు

ఆర్సీపురం తహసీల్దార్​కు వినతి పత్రం సమర్పించిన యజమానులు

Date : 05 August 2024 11:11 PM Views : 989

Ekaburu - స్పెషల్ స్టోరీస్ / సంగారెడ్డి : పైసా పైసా కూడబెట్టి తాము కొనుక్కున్న ప్లాట్లను కొంతమంది అడ్డదారిలో కాజేయాలని చూస్తున్నారని కొల్లూర్​ లక్ష్మీపురం కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు పత్రాలతో పేదల స్థలాలను ధరణిలో ఎక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం రామచంద్రారం తహసీల్దార్​ కార్యాలయానికి వందలాది మంది ప్లాట్ ఓనర్లు చేరుకున్నారు. ప్రత్యేక బస్సులలో బయల్దేరి వందల మంది ప్లాట్ల యజమానులు తహసీల్దార్​ కార్యలయానికి చేరుకొని తమ గోడును వెల్లబోసుకున్నారు. అనంతరం తహసీల్దార్​ సంగ్రామ్​ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్​ అసోసియేషన్​ నాయకులు సత్తయ్య, మల్లేష్, నర్పింహా మూర్తి తదితరులు మాట్లాడుతూ కొల్లూర్​లోని సర్వే నంబర్లు 174, 175, 177, 180 నుండి 183, 186 నుండి 190 వరకు గల లక్ష్మీపురం కాలనీ లేఅవుట్​లో దాదాపు 1500 మంది పేదలు ప్లాట్లు కొనుగోలు చేశారని అన్నారు. 1984 లో అసలు పట్టాదారులు, జీపీఏ హోల్లర్లు అయిన మధుసూదన్​ రెడ్డి, శ్రీనివాస్, రఘునందన్​ రెడ్డిల నుండి నిరుపేదలు ప్లాట్లు కొనుగోలు చేశారని తెలిపారు.

Also Read : స్థానిక సంస్థల ఎన్నికల్లో సగరుల చైతన్యాన్ని ప్రదర్శిస్తాం : సగర సంఘం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర

నాటి నుండి తామే పొజిషన్​లో ఉన్నామని, కానీ ఇటీవల కొంతమంది తప్పుడు పత్రాలను సృష్టించి తమ ప్లాట్లను ఆక్రమించాలని కుట్రలు చేస్తున్నారని వాపోయారు. తాజాగా తమ ప్లాట్ల స్థలాలను ధరణి పోర్టల్​లో చేర్చుకొని వాటికి పట్టా పాస్​ బుక్కులు పొందాలని దరఖాస్తులు చేసుకున్నారని, అక్రమ పద్దతితో ప్లాట్లను ఆక్రమించుకోవాలనుకునే వారికి అధికారులు సపోర్ట్​ చేయొద్దని తహసీల్దార్​కు మొరపెట్టుకున్నారు. ఈ విషయంలో ప్లాట్ ఓనర్లకు అనుకూలంగా రెవెన్యూ అధికారులు గతంలో లోకాయుక్తాకు నివేధిక ఇచ్చారని, దానికి అనుగుణంగా తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తమ ప్లాట్లకు సంబంధించి ఎలాంటి మ్యుటేషన్లు, పాస్ బుక్కులు జారీ చేయొద్దని కలెక్టర్​ను సైతం కలిసినట్లు చెప్పారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి న్యాయం చేయాలని కోరనున్నట్లు వారు పేర్కొన్నారు. ప్లాట్ ఓనర్లకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తానని తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. ​

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :