Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : రాడిసన్ హోటల్లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీలో పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు పాల్గొన్నట్లు సమాచారం అందుతుంది. రాడిసన్ హోటల్లోని 1200,1204 గదుల్లో పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. బీజేపీ నాయకుడు, వ్యాపారవేత్త, రాడిసన్ హోటల్ యజమాని గజ్జల యోగానంద్ కుమారుడు గజ్జల వివేకానంద తమ సొంత హోటల్ నే డ్రగ్స్ పార్టీకి అడ్డాగా మార్చుకున్నాడు. పార్టీ నిర్వహించిన గజ్జెల వివేకానంద్ తో పాటు సినీ నిర్మాత శెలగంశెట్టి కేధారినాథ్, వ్యాపారవేత్త నిర్భయ్ లను పోలీసులు అరెస్టు చేశారు, డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని వైద్య పరీక్షలు నిర్వహించగా, ఈ ముగ్గురికి పాజిటివ్ వచ్చింది.
Also Read : రాడిసిన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీ
హోటల్ సీసీ కెమెరాల ఆధారంగా వ్యాపార, సినీ ప్రముఖులు రఘుచరణ్, సందీప్, క్రిష్ లతో పాటు సినీ సెలబ్రిటీ శ్వేత, ప్రముఖ హీరోయిన్ సోదరి లిషీల మీద సైతం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన కేదారినాథ్ ప్రముఖ నిర్మాత. ఆనంద్ దేవరకొండ గంగం గణేష్ సినిమాకు కేవారినాథ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. హీరో అల్లు అర్జున్ కు సైతం కేవారినాథ్ దగ్గరి స్నేహితుడు. జూబ్లిహిల్స్ లోని హైలైఫ్, బఫెల్లో వబ్ లకు కేధార్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు.
Admin
Ekaburu