Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. హోటల్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించి, డ్రగ్స్ తీసుకుంటున్న శేరిలింగంపల్లి కి చెందిన ఓ రాజకీయ పార్టీ నాయకుడి కుమారుడి తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలి రాడిసిన్ హోటల్ లో శనివారం రాత్రి పార్టీ ఏర్పాటు చేసిన రాజకీయ నాయకుడి కుమారుడు స్నేహితులను ఆహ్వానించారు. ఈ పార్టీలో నిషేధిత కొకైన్ డ్రగ్స్ ను పార్టీ చేసుకున్న యువకులు తీసుకున్నటు తెలుస్తుంది. సమాచారం అందుకున్న ఎస్ఓటి, గచ్చిబౌలి పోలీసులు హోటల్ మీద దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ ఎత్తున కొకైన్ స్వాధీనం చేసుకోవడం తో పాటు రాజకీయ నాయకుడి కుమారుడు, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Admin
Ekaburu