Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : తమ వ్యాపారానికి అడ్డు వస్తున్నారని న్యూ మల్టి కార్ ప్రైవేట్ ట్రావెల్స్ యజమాని రెచ్చిపోయాడు. తన ట్రావెల్స్ సిబ్బందితో అంబులెన్స్ డ్రైవర్ల మీద దాడి చేయించి, కర్రలతో చితకబాదాడు. హైదరాబాద్ కామినేని చౌరస్తా ఫ్లై ఓవర్ వద్ద ప్రైవేట్ ఆస్పతులకు రోగులను షిఫ్ట్ చేసే అంబులెన్స్ లు పార్కింగ్ చేసుకొని ఉంటాయి. ట్రాఫిక్ కి ఇబ్బంది కాకుండా, ఎల్బీనగర్ లో స్థానికంగా ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్ కి అందుబాటులో ఉండే విధంగా గత కొన్నిలుగా కామినేని ఫ్లై ఓవర్ కిందే అంబులెన్స్ డ్రైవర్లు వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. కాగా ఫ్లై ఓవర్ కింద పార్కింగ్ చేసే అంబులెన్స్ లతో తమ వ్యాపారానికి ఇబ్బంది కలుగుతుందని న్యూ మల్టీ కార్ ఓనర్ అంబులెన్స్ డ్రైవర్ల తో గొడవకు దిగాడు. తన సిబ్బందితో కలిసి అంబులెన్స్ డ్రైవర్లపై కర్రలతో దాడి చేశాడు. ఈ దాడిలో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేయగా ట్రాఫిక్ ఎస్ఐతో గొడవ పడ్డారు. గొడవలో గాయపడ్డ వారిని చికిత్స కోసం హాస్పిటల్ తరలించారు. ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Ekaburu