Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : గచ్చిబౌలిలో ఓ హోటల్ యజమాని దారుణ హత్య కు గురయ్యాడు. రహదారి విషయమై హోటల్ పక్కనే ఉండే వ్యక్తితో ఏర్పడిన వివాదం హత్యకు దారితీసింది. పెద్దమనుషుల మధ్య పంచాయతీ పెట్టి తన పరువు తీసాడని కోపం పెంచుకున్న పక్కింటి వ్యక్తి హోటల్ యజమానిని తలపై ఇనుప రాడ్డుతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన కు సంబంధించిన వివరాలు... కొండాపూర్ వైట్ ఫీల్డ్ లో కుటుంబంతో నివాసం ఉండే చల్లూరి శ్రీనివాస్(54) తన కుమారుడు కేశవ్ వినయ్ తో కలిసి గచ్చిబౌలి అంజయ్యనగర్ లో సిఎస్ డిలైట్ ఇన్ పేరుతో హోటల్ నిర్వహిస్తున్నాడు. తమ హోటల్ వెనుక వైపు ఇంట్లో ఓ గదిని అద్దెకు తీసుకొని స్టోర్ రూమ్ గా వాడుకుంటున్నారు.
Also Read : నానక్ రాంగూడలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన మాజీ కార్పొరేటర్ సాయిబాబా
కాగా ఈ రూమ్ కు వెళ్లే దారి విషయంలో పక్క ఇంట్లో ఉండే మహేందర్(35)తో గత సంవత్సరం క్రితం శ్రీనివాస్ కు గొడవ జరిగింది. ఈ విషయమై స్థానిక బస్తీ పెద్దల మద్య పంచాయతీ పెట్టగా, మహేందర్ తీరును బస్తీ పెద్దలు మందలించారు. దీంతో స్థానికుల ముందు తన పరువు పోయిందని మనస్థాపానికి గురైన మహేందర్.. శ్రీనివాస్ మీద కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చేతిలో ఇనుప రాడ్డుతో హోటల్ కు వచ్చిన మహేందర్ ఒక్కసారిగా శ్రీనివాస్ తలపై దాడి చేశాడు. తలకు తీవ్ర గాయాలైన శ్రీనివాస్ ను అతని కుమారుడు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అర్థరాత్రి మృతి చెందాడు. ఈమేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Admin
Ekaburu