Ekaburu - క్రైమ్ / రంగారెడ్డి : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రధాన అనుచరుడు, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్ ను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ లో 1000 గజాల స్థలాన్ని ఆక్రమించి డబ్బులు డిమాండ్ చేసిన శ్రీనివాస యాదవ్, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ ప్లాట్ యజమానిని బెదిరించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేట గ్రామంలోని సర్వేనెంబర్లు 4పి, 5పి, 6పీ లలో ఉన్న ప్లాట్ నెంబర్ 61, 61ఏలలో 500 గజాలు చొప్పున మొత్తం 1000 గజాలను బాధిత ప్లాట్ ఓనర్ ఓనర్ 1994లో కొనుగోలు చేశాడు. అనంతర కాలంలో ల్యాండ్ ఓనర్ అమెరికాకు వెళ్లాడు
Also Read : ఎల్ఆర్ఎస్ పేరుతో 20వేల కోట్లు దోచుకుంటున్న ప్రభుత్వం : కేటీఆర్
ఈ భూమిపై కన్నేసిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రధాన అనుచరుడు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్ మొత్తం 1000 గజాల స్థలాన్ని ఆక్రమించాడు. రాజు క్రికెట్ అకాడమీ పేరుతో ఫెన్సింగ్ వేసాడు. ఆ తర్వాత ప్లాట్లలో చెత్తను వేసి గుడిసెలు వేయించాడు. విషయం తెలుసుకున్న ప్లాట్ల యజమాని తన ప్లాట్లను ఖాళీ చేయాలని స్థల శ్రీనివాసయాదవ్ ను అడగ్గా, బెదిరింపులు దిగాడు, స్థలాన్ని ఖాళీ చేయాలంటే తనకు రూ.5 కోట్లు ఇవ్వాలని, లేకపోతే చంపేస్తానని శ్రీనివాసయాదవ్ ల్యాండ్ ఓనర్ ను బెదిరించాడు. దీంతో ల్యాండ్ ఓనర్ మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. మాదాపూర్ పోలీసులు శ్రీనివాసయాదవ్ పై కేసు నమోదు చేశారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు గురువారం శ్రీనివాస యాదవ్ ను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు..
బిఆర్ఎస్ కీలక నేత... మాదాపూర్ లో నివాసం ఉండే ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ శేరిలింగంపల్లి బిఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడు. బిఆర్ఎస్ మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడుగా ఉన్న శ్రీనివాస్ యాదవ్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి ప్రధాన అనుచరుడు. నిత్యం ఎమ్మెల్యే వెంటే ఉంటూ, ఎమ్మెల్యే గాంధీ శేరిలింగంపల్లి లో ఏ ప్రాంతానికి వెళ్లినా వెంట ఉంటాడు.
Admin
Ekaburu