Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : చందానగర్ ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీకి పాల్పడిన ముగ్గురు దండగలను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 12వ తేదీన చందానగర్ లోని ఖజానా జ్యువెలర్స్ లో ముసుగులు ధరించి తుపాకులతో కాల్పులు జరిపి బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లిన విషయం తెలిసిందే. దోపిడీ అనంతరం నిందితుల కోసం 10 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన సైబరాబాద్ పోలీసులు దోపిడీకి పాల్పడింది బీహార్ ముఠాగా గుర్తించారు. ఈ మేరకు ఈ ముఠాలోని ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సమాచారం. ఇద్దరు నిందితులను బీహార్ లో, మరో నిందితుడిని పూణేలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. నగరంలో దోపిడీ చేసేందుకు నెల రోజుల క్రితం బీహార్ నుంచి నగరానికి వచ్చారు. నగరానికి వచ్చి సమయంలోనే గన్ లు తమ వెంట తెచ్చుకున్నారు. జగద్గిరిగుట్టలో ఓ గ్లాస్ కంపెనీలో పనికి చేరి దొంగతనం కోసం రెక్కీ నిర్వహించారు. దోపిడీ అనంతరం నగరం నుంచి పారిపోయిన ఈ ముఠాలో ముగ్గురు నిందితులు పోలీసుల చేతికి చిక్కారు.
Admin
Ekaburu