Wednesday, 22 April 2026 05:10:02 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

అంజయ్య నగర్ రణరంగం - ఇరువర్గాల దాడులు

ఇంటిపై దాడి చేసి కబ్జాకు యత్నించిన ఓ వర్గం

Date : 06 August 2025 06:37 PM Views : 514

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : గచ్చిబౌలి అంజయ్య నగర్ రణరంగంగా మారింది. రెండు వర్గాలు రహదారిపై బాహాబాహికి దిగి దాడులకు పాల్పడడంతో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది. ప్రధాన రహదారిపై రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అంజయ్య నగర్ లో ఓ ఇంటిని కాళీ చేయించేందుకు ఓ వ్యక్తి తన అనుచరులతో దాడి చేయడంతో వివాదం ఏర్పడింది. సదరు ఇంటి కరెంటు మీటరును తొలగించి ఇంట్లో ఉన్న వారిపై దాడులకు తెగబడ్డారు. విషయం గమనించిన స్థానికులు ఇంటి యజమానికి అండగా వచ్చి కబ్జాకు వచ్చిన వారిపై ప్రతి దాడి చేశారు. దీంతో కబ్జాకు వచ్చినవారు అక్కడి నుండి పారిపోగా స్థానికులకు దొరికిన కొందరిపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు.

Also Read : అధికారుల అండదండలా.. అక్రమార్కుల బరితెగింపా

అంజయ్య నగర్ సగర సంఘం కార్యాలయం పక్కనే ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్రభయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి ప్రధాన రహదారి మీదకు వచ్చిన ఇరువర్గాలు ఉరుకులు, పరుగులతో దాడులకు తెగబడడంతో ఈ దారిలో వెళ్తున్న వాహనదారులు బంబేలెత్తారు. ఈ దాడుల విషయమై రామకృష్ణ అనే ఇంటి యజమాని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :