Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : గచ్చిబౌలిలోని ఓ ఐటీ సంస్థలో వెలుగుచూసిన భారీ స్కాం సంచలంగా మారింది. సంస్థ మాజీ ఉద్యోగులు, ఉద్యోగం వదిలేసిన వారి ఫైనల్ సెటిల్ మెంట్ల పేరుతో సంస్థకు చెందిన 3.2 కోట్ల రూపాయలను బినామీ బ్యాంకు ఖాతాల్లోకి తరలించడం సంచలనంగా మారింది. అమెజాన్ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ ఫైనాన్షియల్ ఆపరేషనల్ అనలిస్ట్ ఈ స్కాం కు సూత్రధారిగా గుర్తించిన అమెజాన్ నిర్వాహకులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు గచ్చిబౌలి అమెజాన్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ ఫైనాన్షియల్ ఆపరేషనల్ అనలిస్ట్ వెంకటేశ్వర్లు ను అరెస్టు చేశారు.
Also Read : ఆ తేదీనే రాష్ట్రాన్ని తాకనున్న రుతుపవనాలు...
గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలో ఉన్న అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ (ఇండియా) సంస్థలో మెట్టు వెంకటేశ్వర్లు సీనియర్ ఫైనాన్షియల్ ఆపరేషనల్ అనలిస్ట్-పేరోల్ గా విధులు నిర్వహించాడు. సంస్థను వదిలిపెట్టిన ఉద్యోగుల, మాజీ ఉద్యోగుల ఫైనల్ సెటిల్మెంట్లతో పాటు అమెజాన్ ఉద్యోగుల ఎండ్ టు ఎండ్ పేరోల్ కార్యకలాపాలను వెంకటేశ్వర్లు నిర్వహిస్తుంటాడు. కాగా సంస్థను వదిలిపెట్టిన, మాజీ ఉద్యోగుల కొన్ని లావాదేవీలు ఫైనల్ సెటిల్మెంట్ కాకుండా చాలా రోజులుగా ఉండడం గమనించిన వెంకటేశ్వర్లు భారీ స్కాం కు స్కెచ్ వేశాడు. సంస్థలో పనిచేస్తున్న తన అనుచరులతో కలిసి మాజీ ఉద్యోగుల పేరిట బ్యాంకు ఖాతాలను మార్చి, కొత్త ఖాతాలను సృష్టించాడు. వాటి సహాయంతో సదరు మాజీ ఉద్యోగులకు ఫైనల్ సెటిల్మెంట్ చేసి, వారికి వెళ్లవలసిన డబ్బును తన బినామీ ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. ఈ విధంగా అమెజాన్ సంస్థలో గతంలో పనిచేసిన 184మంది మాజీ ఉద్యోగుల ఫైనల్ సెటిల్మెంట్ చేసి, 3.22 కోట్ల నగదును తన స్నేహితులు, బందువుల పేరుతో ఉన్న 50 బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించాడు. 2016 నుంచి 2023 మధ్య కాలంలో వెంకటేశ్వర్లు ఈ స్కాం కు పాల్పడ్డాడు. ఈ మధ్య కాలంలో ఈ విషయాన్ని గమనించిన అమెజాన్ సంస్థ నిర్వాహకులు సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సు వింగ్ కు పిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని వెంకటేశ్వర్లు ను అరెస్టు చేశారు.
Admin
Ekaburu