Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : ఉబర్ బైక్ రైడర్ పార్సిల్ తో ఉదాయించడంతో బాధితుడు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు బాధితుడి ఫిర్యాదు ప్రకారం... మాదాపూర్ లోని ప్రైవేట్ హాస్టల్లో నివాసం ఉంటున్న వీరేష్ అనే యువకుడు తన కజిన్ కు ఫుడ్, కొన్ని పుస్తకాలు పంపించడం కోసం ఉబర్ యాప్ లో బుకింగ్ చేశాడు. ఉబర్ టూ వీలర్ డ్రైవర్ వీరేష్ వద్ద పార్సిల్ తీసుకొని తన కజిన్ కు డెలివరీ చేయలేదు. వీరేశ్ సదరు డ్రైవర్ ను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
Also Read : గోపన్ పల్లి ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం
దీంతో ఉబర్ సంస్థకు వీరేష్ ఫిర్యాదు చేయగా, నిర్వాహకులు డ్రైవర్ పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. డ్రైవర్ నెంబర్ కు వీరేష్ ఫోన్ చేయగా అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో తన న్యాయం చేయాలంటూ వీరేష్ బుధవారం మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు.
Admin
Ekaburu