Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధి గోపన్ పల్లి గ్రామంలోని శ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. వార్షికోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండేలా చూడాలని వేడుకున్నానని తెలిపారు.
Also Read : మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ మార్గదర్శకాలు విడుదల
అమ్మవారి ఆశీస్సులతో గచ్చిబౌలి డివిజన్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన అన్నారు. దేవాలయ అభివృద్ధిలో తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ పూజల్లో పాల్గొని పూజలు చేయడం తన అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, గోపన్ పల్లి గ్రామ ప్రజలు, స్థానిక నేతలు, భక్తులు పాల్గొన్నారు.
Admin
Ekaburu