Wednesday, 22 April 2026 05:10:47 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

శేరిలింగంపల్లిలో బయట పడ్డ నకిలీ జీఓ 59 పట్టాల బాగోతం

జీహెచ్ఏంసీ పిర్యాదుతో రాయదుర్గం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు

Date : 24 February 2025 12:07 PM Views : 1374

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి మండల పరిధిలో నకిలీ పట్టాల బాగోతం బయటపడడం సంచలనంగా మారింది గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన జీవో 58 59 పట్టాల నకిలీ వి సృష్టించి అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారు నకిలీ పట్టాల ఆసరాగా జిహెచ్ఎంసి భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయగా సదరు స్థలాల్లో భారీ ఎత్తున భవనాలు వెలిశాయి. తాజాగా గచ్చిబౌలి సర్వే నెంబర్ 134, 135, 136 లో ఓ పార్కు స్థలం కబ్జాకు గురికావడంతో జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి జీహెచ్ఏంసీ, రెవెన్యూ అధికారులకు పిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు పై విచారణ చేపట్టిన జిహెచ్ఎంసి అధికారులు సదరు పట్టాల ధ్రువీకరణ కోసం శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులను సంప్రదించారు. దీనిపై రెవెన్యూ అధికారులు సదురుపట్టాలు తమ రెవెన్యూ కార్యాలయం మంజూరు చేసినవి కావని.. నకిలీ పట్టాలని తేల్చారు. దీంతో నకిలీ పట్టాలతో జిహెచ్ఎంసి భవన నిర్మాణ అనుమతులు పొందిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి సర్కిల్ అధికారులు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పై శనివారం కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నకిలీ పట్టాల బాగోతంలో మొత్తం నలుగురిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read : డిజిటల్​ అరెస్ట్​ పేరుతో రూ.1.38 కోట్లు కొట్టేసిన సైబర్​ కేటుగాళ్లు

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :