Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : జీహెచ్ఎంసి నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలిని గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై చర్చించారు. పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తిచేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఐటీ కారిడార్ ప్రాంతం కావడం దృష్ట్యా అభివృద్ధి పనులను కొనసాగించాలని, అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అధిక మొత్తంలో నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.
వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యపై సిబ్బందిని పూర్తి స్థాయిలో సన్నద్ధం చెయ్యాలని, ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బ తిన్న రోడ్ల పునరుద్ధరణకై నిధులు మంజూరు చేసి త్వరితగతిన పనులు పూర్తి అయ్యేలా చూడాలని అన్నారు. ఐటీ కారిడార్ లో అభివృద్ధి పనులను క్రమం తప్పకుండా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే గాంధీతో పాటు మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు.
Admin
Ekaburu