Wednesday, 22 April 2026 05:07:21 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

ఐటి రంగంలో నగరాన్ని అగ్రభాగాన నిలిపిన ఘనత కెటిఆర్ ది: మాజీ కార్పొరేటర్ సాయిబాబా

శేరిలింగంపల్లిలో ఘనంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ జన్మదిన వేడుకలు

Date : 24 July 2024 11:10 PM Views : 1134

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : ఐటి రంగంలో హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ ఐటి శాఖమంత్రి కెటి.రామారావుదని తెలంగాణ ఉద్యమకారుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కెటీఆర్ జన్మదిన వేడుకలను కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలోని చందానగర్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, వివేకానందనగర్ కార్పొరేటర్ రోజా రంగారావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులు, బిఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ కేక్ ను కట్ చేసి కెటిఆర్ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.

Also Read : శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణుల్లో భగ్గుమన్న విబేధాలు

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ కార్పొరేటర్ సాయిబాబా మాట్లాడుతూ ఐటి రంగాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లిన కెటిఆర్ కార్యదక్షత కారణంగా నగరంలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయన్నారు. ఐటి రంగంపై తనకు ఉన్న అనుభవంతో నగరంలో ఐటి పరిశ్రమ అభివృద్ధి కోసం ఎన్నో చర్యలు తీసుకున్నారని అన్నారు. ఐటి శాఖ మంత్రిగా కెటిఆర్ శేరిలింగంపల్లి నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, నియోజకవర్గం వరిధిలో కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10ఏళ్ల కాలంలో శేరిలింగంపల్లిలో 9వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు.

పటిష్టమైన కార్యకర్తలు, పార్టీ అభిమానులతో శేరిలింగంపల్లిలో బిఆర్ఎస్ పార్టీ అత్యంత బలంగా ఉందని, రాబోయే రోజుల్లో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు బిఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోమండ్ల శ్రీనివాస్ రెడ్డి, పురుషోత్తంయాదవ్, మిద్దెల మల్లారెడ్డి, రవీందర్ యాదవ్, బిఎస్ఎన్. కిరణ్, భాస్కరరావు, వాల హరీష్ రావు, రాగం జంగయ్యయాదవ్, తిరుమల్లేష్, బాబు మల్లేష్, గణేష్ రెడ్డి, దారుగువల్లి నరేష్, అంజమ్మ, రాజుముదిరాజ్, అశోక యాదవ్ తో పాటు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :