Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : రానున్న పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా గచ్చిబౌలి డివిజన్ పార్టీ శ్రేణులు పనిచేయాలని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారం నేపద్యంలో గురువారం ఖాజాగూడలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో డివిజన్ ముఖ్య నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలతో సాయిబాబా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Also Read : కర్ణాటక నుంచి తెలంగాణకు డీజిల్ స్మగ్లింగ్
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ప్రజలు బిఆర్ఎస్ పక్షానే ఉన్నారని, పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ కు శేరిలింగంపల్లి నుంచి భారీ మెజారిటీ రావడం ఖాయమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. మాజీ కార్పొరేటర్ సాయిబాబా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, నాయకులు దారుగుపల్లి నరేష్, శంకరి రాజు ముదిరాజ్ లతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Ekaburu