Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న ఖాజాగూడ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అభిలాషించారు. ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి ఎంతో కీలకమని, భవిష్యత్తు లో మన జీవితం ఏ దిశలో సాగాలో నిర్ణయించేది పదవ తరగతి అని అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి సాయిబాబా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Also Read : తెలంగాణలో మే 13న పార్లమెంటు ఎన్నికల పోలింగ్
ఈ సందర్భంగా కొమిరిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందజేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ ఖాజాగూడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేసి, అల్ ది బెస్ట్ చెప్పడం ప్రతిసంవత్సరం ఆనవాయితీగా వస్తుందన్నారు. పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని, చదువుకున్న పాఠశాలకు, విద్య చెప్పిన గురువులకు, కన్న తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ రాజశేఖర్ రెడ్డి, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ శ్యామల, మని మాధురి, వెంకట్ రామ్ రెడ్డి, నరహరి, శ్రీనివాస్ రెడ్డితో పాటు నాయకులు నరేష్, అంజమ్మ, రాజు ముదిరాజ్, రమేష్ గౌడ్, బాలమణి తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu