Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రతిఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని, అంబేద్కర్ అడుగుజాడల్లో నడవడమే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో గల బాబు జగ్జీవన్ రామ్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలలో ఆదివారం మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ అంబెడ్కర్ అడుగుజాడల్లో నడవడమే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వారిని స్మరించుకొని, వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
Also Read : అన్నివర్గాల ఆరాధ్యదైవం బిఆర్.అంబేద్కర్ : కొమిరిశెట్టి సాయిబాబా
అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఎలా అందాలో గొప్ప నిర్దేశం చేసిన వ్యక్తి అంబేద్కర్ అని, అంబేద్కర్ గారు ఒక జాతికి చెందిన వ్యక్తి కాదని అన్ని వర్గాల ఆరాధ్య దైవమన్నరు. సమాజంలో అణిచివేతకు గురిచేయపడ్డ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలను చేసి వారికి సమాజంలో గుర్తింపు సాధించిపెట్టారు అని, వారి పోరాటాల ఫలితంగానే నేడు దేశంలో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు, ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం జరిగింది అని తెలిపారు. అంబెడ్కర్ జయంతి ఒక కులానికో, మతానికో సంబంధించినది కాదని, ఇది దేశ ప్రజలందరిదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం బాబు జగ్జీవన్ రామ్ యువజన సంఘం అధ్యక్షులు సంజీవ, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, సీనియర్ నాయకులు ,శ్యామ్ యాదవ్, ఇందిరా, నందు, ప్రభాకర్, మన్నే రమేష్, రంగస్వామి, విష్ణు, ప్రవీణ్, దుర్గరామ్ , విజయ్, చిన్న, క్రాంతి, మధు , టింకు, ప్రవీణ్ ,స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Ekaburu