Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని సాయిరాం కాలనీ వాసులు బుధవారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని కలిశారు. ఎమ్మెల్యే నివాసంలో హఫీజ్ పేట్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గాంధీని కలిసిన కాలనీ వాసులు కాలనిలో నెలకొన్న సమస్యలు, చేపట్టాలసిన అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ సాయిరాం కాలనీలో నెలకొన్న పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని,దశల వారీగా కాలనీని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని హమీ ఇచ్చారు. కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన డ్రైనేజీ, రోడ్డు పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, సాయిరాం కాలనీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.
Also Read : అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం
త్వరలోనే అధికారులతో కలిసి కాలనీలో పర్యటించి, సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తానని ఎమ్మెల్యే గాంధీ హామీ ఇచ్చారు. దశల వారిగా సాయిరాం కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టి, కాలనీలో ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తున్నానని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, కాలనీ వాసులు పాండు ముదిరాజ్, బాబుగౌడ్, వెంకటేష్, జితేందర్, మల్లేష్ గౌడ్ లతో పాటు స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
Admin
Ekaburu