Tuesday, 28 July 2026 05:36:05 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

ఎమ్మెల్యే గాంధీని కలిసిన సాయిరాం కాలనీ వాసులు

సాయిరాం కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ

Date : 13 March 2024 05:14 PM Views : 779

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని సాయిరాం కాలనీ వాసులు బుధవారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని కలిశారు. ఎమ్మెల్యే నివాసంలో హఫీజ్ పేట్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గాంధీని కలిసిన కాలనీ వాసులు కాలనిలో నెలకొన్న సమస్యలు, చేపట్టాలసిన అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ సాయిరాం కాలనీలో నెలకొన్న పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని,దశల వారీగా కాలనీని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని హమీ ఇచ్చారు. కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన డ్రైనేజీ, రోడ్డు పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, సాయిరాం కాలనీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.

Also Read : అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం

త్వరలోనే అధికారులతో కలిసి కాలనీలో పర్యటించి, సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తానని ఎమ్మెల్యే గాంధీ హామీ ఇచ్చారు. దశల వారిగా సాయిరాం కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టి, కాలనీలో ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తున్నానని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, కాలనీ వాసులు పాండు ముదిరాజ్, బాబుగౌడ్, వెంకటేష్, జితేందర్, మల్లేష్ గౌడ్ లతో పాటు స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: