Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : మియాపూర్ డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో సినాప్సిస్ సాప్ట్ వేర్ సంస్థ సౌజన్యంతో Nirman.org ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మూడు అదనపు తరగతి గదులు, సోలార్ వ్యవస్థ, సైన్స్ లాబ్ పరికరాలు, గ్రీన్ బోర్డ్ లను స్థానిక కార్పొరేటర్ శ్రీకాంత్ తో కలిసి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ సినాప్సిస్ సంస్థ సామాజిక సేవలో భాగంగా పేద విద్యార్థులు చదుకునే ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ప్రతిఒక్కరు సినాప్సిస్ సంస్థను ఆదర్శంగా తీసుకొని, తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ముందుకు రావాలని సూచించారు.
నాయకులు సైతం తమ ప్రాంత పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు ఎదో ఒక రూపంలో సహాయం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గాంధీ పిలుపునిచ్చారు. విద్యార్థులు తమకు అందుతున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని చదువులో ఉత్తమంగా రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సినాప్సిస్ సంస్థ సైట్ డైరెక్టర్ నరేంద్ర, సీనియర్ మేనేజర్ నర్సింహ, నిర్మాణ్ సంస్థ కో ఆర్డినేటర్ అనురాధ, భార్గవ రామ్, భగవాన్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వసుంధర దేవి , ఉపాధ్యాయులు బాల్ రెడ్డి ,మదన్ మోహన్ సత్యనారాయణరావు, వీణ, గౌసియా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రసాద్, చంద్రిక ప్రసాద్,మహేందర్ ముదిరాజ్, మహమ్మద్ ఖాజా ,స్వరూప, ముజీబ్, రోషన్, తిమ్మరాజు, శ్రీ శైలం, రామకృష్ణ,గోల్కొండ రాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu