Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : ముస్లింల సంక్షేమానికి గత బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చి వారి అభివృద్ధికి కృషి చేసిందని శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని చిన్న అంజయ్య నగర్ లో గల మసీదులో నిర్వహించిన దవాత్- ఏ - ఇఫ్తార్ విందులో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని, రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రంజాన్ ఉపవాస దీక్షల్లో ఉండే ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఇవ్వడం అభినదించదగ్గ విషయం అన్నారు. రంజాన్ పండుగ తెలంగాణలో మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, తెలంగాణకు ప్రత్యేకమైన "గంగా జమునా తెహజీబ్" మరింతగా పరిఢవిల్లాలని ఆకాంక్షించారు.
Also Read : సర్దార్ సర్వాయి పాపన్నకు గౌడ సంక్షేమ సంఘం ఘన నివాళి
తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ముస్లింల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని ముస్లిం ప్రజానీకానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో అండగా నిలిచారని గుర్తుచేశారు. షాదిముబారక్ పథకం ద్వారా పేదింటి ముస్లిం ఆడపిల్లల పెళ్లికి 1 ,00 ,116 రూపాయలు ఇవ్వడం, మైనారిటీ గురుకుల స్కూల్స్ ప్రారంభం వంటి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. పేదింటి ముస్లింలు పండుగను ఎటువంటి వెలితి లేకుండా జరుపుకునేందుకు రంజాన్ తోఫా ను అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు షేక్ యూసఫ్ పాషా, సయ్యద్ నయీమ్, షౌకత్, సద్దాం, సయ్యద్ జహీర్, చందు, రాజు నాయక్, జై సింగ్, అజామ్, జంగీర్ బీ తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu