Sunday, 01 March 2026 11:28:06 AM
# జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు # గ్రామంలో ఓటర్లు లేని సామాజిక వర్గానికి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వ్

శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ - కాంగ్రెస్ కండువా వార్

బలవంతంగా మెడలో కండువా వేసి పార్టీలో చేరినట్టు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుల గగ్గోలు

Date : 27 April 2024 02:09 AM Views : 3065

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య కండువా వార్ కొనసాగుతుంది. ప్రచారానికి వస్తున్న కాంగ్రెస్ నాయకులు బలవంతంగా కండువా కప్పి, దాన్ని ఫొటోలు తీసి... తాము కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా అసత్య ప్రచారం చేస్తున్నారని పలువురు బీఆర్ఎస్ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. కాంగ్రెస్ నాయకుల తీరు కారణంగా తాము పార్టీ మారలేదని వివరణ ఇచ్చుకోవలసి వస్తుందని వాపోతున్నారు. గతకొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు రాజునాయక్ ఇదే విషయంలో మీడియా ముందుకు వచ్చి తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని... ప్రచారం కోసం వచ్చిన కాంగ్రెస్ నాయకులు బలవంతంగా మెడలో కండువా వేసి, ఫోటోలు తీసి పార్టీ మారినట్టు ప్రచారం చేసారని వాపోయాడు. తాజాగా మధురానగర్ కు చెందిన ఇద్దరు బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు సైతం ఇదే తరహా ఆరోపణలు చేశారు.

Also Read : చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం ఖాయం: మాజీ కార్పొరేటర్ సాయిబాబా

తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, పార్టీ మారినట్టు వస్తున్న ప్రచారం అవాస్తవమని వార్డు కమిటీ మెంబర్ అంజమ్మ, బీఆర్ఎస్ నాయకురాలు బాలామణిలు ప్రకటించారు. ఈ మేరకు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ను కలిసిన అంజమ్మ, బాలామణిలు బీఆర్ఎస్ కండువా వేసుకొని తాము పార్టీ మారలేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం మధురానగర్ కు ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు తమ ఇంటికి వచ్చి అకస్మాత్తుగా మెడలో కండువా వేసి తాము పార్టీ మారినట్టు ప్రచారానికి తెరతీశారని వాపోయారు. తమకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని, తాము ఎప్పటికి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని ప్రకటించారు. ఈ విషయాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :