Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి పరిధిలోని చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడాలని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డిని కలిసి కోరారు. అభివృద్ధి పేరుమీద ఒకవైపు... లేక్ బ్రీజ్, లేక్ వ్యూల పేరుమీద మరోవైపు కార్పోరేట్ సంస్థల కుట్రపూరిత విధానాలతో శేరిలింగంపల్లి ప్రాంతంలో ఉన్న చెరువులను అన్యాక్రాంతం చేస్తున్నాయని కసిరెడ్డి భాస్కరరెడ్డి తహసీల్దార్ దృష్టికి తెచ్చారు. అభివృద్ధి పేరుమీద చెరువుల్లో నీరులేకుండా చేయడం వల్ల పరిసర ప్రాంతాల బోర్లు ఎండిపోయి వచ్చే ఎండాకాలంలో నీటి సమస్య తీవ్రమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని జనం కోసం తహసీల్దార్ దృష్టికి తెచ్చారు. చెరువుల్లో జీహెచ్ఎంసీ గుడ్డిగా పర్మీషన్ ఇవ్వడాన్ని నిరోధించాలని జనం కోసం తహసీల్దార్ ను కోరింది. నల్లగండ్ల పెద్ద చెరువు కబ్జాలకు పాల్పడుతున్న ఆపర్ణ సంస్థపై చర్యలు తీసికొని, చెరువును కాపాడాలని తహశీల్దార్ ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని భాస్కర రెడ్డి తెలిపారు. శేరిలింగంపల్లి భవిష్యత్ తరాల మనుగడ కోసం చెరువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.
Admin
Ekaburu