Wednesday, 22 April 2026 05:05:24 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

బోనాల ఉత్సవాల కోసం శేరిలింగంపల్లి దేవాలయాలకు ప్రభుత్వ నిధులు : ఎమ్మెల్యే గాంధీ

రాయదుర్గం ఫలహారం బండి ఊరేగింపులో ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబా

Date : 29 July 2024 10:32 PM Views : 1042

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు మంజూరయ్యేలా కృషి చేశానని శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ అన్నారు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపులో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా లతో కలిసి ఎమ్మెల్యే గాంధీ పాల్గొన్నారు. అంతకుముందు గోపన్ పల్లి ఎన్టీఆర్ నగర్, తండాల్లో గల దేవాలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ బోనాల ఉత్సవాల కోసం దేవాలయాలకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలను సుఖ సంతోషాలతో చూడాలని అమ్మవారికి హైందవ మహిళలు బోనం సమర్పించడం తెలంగాణ విశిష్టత అని అన్నారు. మాజీ కార్పొరేటర్ సాయిబాబా మాట్లాడుతూ బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :