Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు మంజూరయ్యేలా కృషి చేశానని శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ అన్నారు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపులో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా లతో కలిసి ఎమ్మెల్యే గాంధీ పాల్గొన్నారు. అంతకుముందు గోపన్ పల్లి ఎన్టీఆర్ నగర్, తండాల్లో గల దేవాలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ బోనాల ఉత్సవాల కోసం దేవాలయాలకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలను సుఖ సంతోషాలతో చూడాలని అమ్మవారికి హైందవ మహిళలు బోనం సమర్పించడం తెలంగాణ విశిష్టత అని అన్నారు. మాజీ కార్పొరేటర్ సాయిబాబా మాట్లాడుతూ బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.
Admin
Ekaburu