Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని, ఎవరికి వారే తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అన్నారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొండాపూర్ డివిజన్ అంజయ్య నగర్ లోని శారదా హైస్కూల్ లో ఆదివారం మజీద్ బండ హోలిస్టిక్ హాస్పటల్ సహకారంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆదివారం ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఎత్తు, బరువు, రక్తపోటు, షుగర్, పల్స్, నేత్ర పరీక్షలతో పాటు ఈ.సీ.జీ. మొదలైన పరీక్షలు నిర్వహించారు. జనరల్ ఫీజిషియన్ డాక్టర్ సద్గురు, ఆర్థో డాక్టర్ విశ్వనాథ్ వైద్య సేవలు అందించారు.
Also Read : ప్రభుత్వ భూముల ఆక్రమణపై కలెక్టర్ కు పిర్యాదు చేసిన జనంకోసం
ఈ సందర్భంగా రామస్వామి యాదవ్ మాట్లాడుతూ మారిన జీవనశైలి, పర్యావరణంలో వస్తున్న అనేక మార్పుల కారణంగా మానవులు అనేక వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. మానవుడికి ఆరోగ్యమే మహాభాగ్యమని, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యానికి గురికాకుండా ఉండవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరు నిత్యవ్యాయామం, మెడిటేషన్, యోగా, ధ్యానము, నడక నిత్యజీవితంలో అలవాటు చేసుకోవాలని, సాధ్యమైనంత వరకు తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, పాలు, పాలఉత్పత్తులు, చేపలు, గ్రుడ్లు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం తీసుకొవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ బందా నరేంద్రబాబు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు పాలం శ్రీను, హాస్పిటల్ ప్రతినిధి శివ తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu