Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : పర్యావరణ పరిరక్షణతోనే మన భావితరాల మనుగడ సాధ్యమని, మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని సోమవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని సోమవారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఈ మేరకు గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి వార్డు కార్యాలయంలో జెండాఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మొక్కలు నాటారు.
Also Read : వర్షాకాలంలో నగర వాసులకు మంచినీటి సమస్యలా: గంగల రాధాకృష్ణ యాదవ్
అనంతరం మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత, పచ్చదనాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందన్నారు. నగరంలోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పించడంతో పాటు పరిసరాల పరిశుభ్రతపై ఐదు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్, పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా డివిజన్ పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని ప్రకృతి వనం చేసే విధంగా కృషిచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ సంజయ్, డిఈ విశాలాక్షి, ఏఈ జగదీష్, సిబ్బంది మురళీ, జావేద్, భరత్, రాందాస్, శ్రీనివాస్, కిష్టయ్య, రాఘు, జవాన్, నాయకులు కిషన్, నర్సింగ్ నాయక్, ప్రసాద్, శ్రీనివాస్, రాజు, నర్సింగ్ రావు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu