Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం కోసం 4 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్, వరద నీటి కాలువ నిర్మాణ పనులను గురువారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షం పడిన ప్రతిసారి స్థానికులు, వాహనదారులు వరద ముంపు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వర్షాకాలంలో చిన్న వర్షానికే లింగంపల్లి అండర్ బ్రిడ్జి వరద నీటితో మునిగిపోతుందని, ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం 4 కోట్ల రూపాయల నిధులతో బాక్స్ కల్వర్ట్ తో పాటు వరద నీటి కాలువ నిర్మాణ పనులను చేపడుతున్నట్టు తెలిపారు.
ఈ పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో ఆలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని, నాణ్యత లో రాజీ పడకుండా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. కల్వర్ట్ నిర్మాణ పనులపై అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులో కి వస్తే దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న వరద ముంపు సమస్య నుంచి స్వాంతన లభిస్తుందని అన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేపట్టాలని సూచించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఫ్లై ఓవర్లు, లింక్ రోడ్లు, రహదారుల విస్తరణ చేపడుతూ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు వీరేశం గౌడ్,మోహన్ గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు యాదగిరి గౌడ్, దొడ్ల రామ కృష్ణ గౌడ్, గడ్డం రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu