Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం చివరి రోజు శనివారం గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు డివిజన్ మొత్తం ర్యాలీ నిర్వహించారు. ఖాజాగూడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ రాయదుర్గం, టెలీకామ్ నగర్, గచ్చిబౌలి, జిపిఆర్ఏ క్వార్టర్స్, గుల్మోహర్ పార్క్, నల్లగండ్ల, గోపన్ పల్లి, ఎన్టీఆర్ నగర్, గౌలిదొడ్డి, నానక్ రాంగూడ మీదుగా సాగింది. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయడం ఖాయమన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారని, తమ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు భారీ మెజారిటీని అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని, ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పాలన మీద రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక పార్లమెంట్ స్థానాలను అందిస్తే మరోసారి కెసిఆర్ తెలంగాణ రాజకీయాలను శాసించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెన్నంరాజు, దారుకుపల్లి నరేష్ శంకరి రాజు ముదిరాజ్ రమేష్ గౌడ్ లతోపాటు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Ekaburu