Wednesday, 22 April 2026 05:07:58 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చంద్రిక రాజీనామా

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీలో ముసురుకున్న వివాదాలు

Date : 25 October 2025 10:52 PM Views : 880

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కొమ్ములాటలు అటు రాష్ట్రస్థాయిలోనే కాదు.. ఇటు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సైతం బయటపడుతున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటల కారణంగా నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తన పదవికి రాజీనామా చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చంద్రిక ప్రసాద్ గౌడ్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతారావుకు పంపించారు. నియోజకవర్గం లోని కొంతమంది సభ్యులు తనమీద కొంతకాలంగా నకిలీ ప్రచారం చేస్తున్నారని వాపోయారు. తాను అనని మాటలను ప్రచారం చేస్తున్నారని, దీని కారణంగా తన వ్యక్తిత్వం దెబ్బతింటుందన్నారు.

మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీ జ్యోతి పామన సైతం ఈ ప్రచారాన్ని నమ్మి తనకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ, నకిలీ ఆధారాలను సేకరిస్తున్నారని వాపోయారు. ఇటువంటి వ్యక్తిగత దాడి చేస్తున్న పరిస్థితుల్లో తాను మానసికంగా ఇబ్బందులు పడుతున్నానని, ఈ పరిస్థితుల్లో నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగడం ఇష్టం లేక తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. శేరిలింగంపల్లి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో తనకు అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, మహిళా కాంగ్రెస్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :