Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మియాపూర్ ఆల్విన్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అసమానమని, మొట్టమొదటి బహుజన వీరుడు, బహుజన చక్రవర్తి ,బహుజన నాయకుడు అయినా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని, శతాబ్దాల కిందటే రాచరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పేద ప్రజలను సంఘటితం చేసి రాజకీయ , సామాజిక సమానత్వమే మూల సూత్రంగా గోల్కొండ ఏలిన బహుజన చక్రవర్తి సర్వాయి పాపన్న అని ఎమ్మెల్యే గాంధీ కొనియాడారు.
Also Read : గచ్చిబౌలిలో పోలీసులకు చిక్కిన డ్రగ్స్ ముఠా
సమాన్యులనే సైనికులుగా మార్చి గోల్కొండ కోటనే జయించిన సర్వాయి పాపన్న జీవితం అందరికి ఆదర్శమని, భారత దేశాన్ని పాలించే మొఘల్ చక్రవర్తులు పాపన్న పై దాడి చేస్తే సమాన్యుల్లో స్ఫూర్తిని నింపి మొఘల్ సైన్యాన్ని ఓడించిన ధీరుడని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దొంతి లక్ష్మీ నారాయణ గౌడ్, గౌరవ సలహాదారులు వి.జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ గౌడ్ కోశాధికారి పుట్ట వినయ్ కుమార్ గౌడ్ , స్టీరింగ్ కమిటీ సభ్యులు మోహన్ గౌడ్ అశోక్ గౌడ్ యూత్ కమిటీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, నాయకులు కరుణాకర్ గౌడ్ ఓం ప్రకాష్ గౌడ్ నాగేశ్వర్ గౌడ్ వెంకటేష్ గౌడ్ అనిల్ కుమార్ గౌడ్ ,మురళితో పాటు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,ఏకాంత్ గౌడ్, చింత కింది రవీందర్, నందు, పవన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu