Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : ప్రజాభిమానంలో తమకు ఎవ్వరూ పోటీ లేరని, గచ్చిబౌలి డివిజన్ లో తాము చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై ఎంతోమంది బీజేపీలో చేరుతున్నారని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి, గోపనపల్లి తాండకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు, సత్య, శ్రీకాంత్, రాజేష్, రామకృష్ణ, కుమార్, గిరి,సుమన్, మణికంఠ, శ్రీశైలం, వెంకటేష్ తదితరులు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా గోపన్ పల్లిలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీలో నూతనంగా చేరిన వారిని పార్టీ కండువాలతో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి అనేక మంది బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అతి తక్కువ కాలంలోనే చేసి చుపించిందని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరువ చేస్తున్నామని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శేఖర్, ప్రభాకర్, ప్రకాశ్ , మహేష్, రమేష్, రంగస్వామి, చిన్న, నర్సింగ్ రావు, శ్రీకాంత్, మధు, నరసింహ ,గోవర్ధన్, సింధు, విష్ణు,సురేష్,శంకర్ స్థానిక నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Ekaburu