Wednesday, 22 April 2026 05:04:44 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

ప్రజాభిమానంలో మాకెవరూ పోటీలేరు : గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన యువత

Date : 25 July 2024 12:20 AM Views : 962

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : ప్రజాభిమానంలో తమకు ఎవ్వరూ పోటీ లేరని, గచ్చిబౌలి డివిజన్ లో తాము చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై ఎంతోమంది బీజేపీలో చేరుతున్నారని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి, గోపనపల్లి తాండకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు, సత్య, శ్రీకాంత్, రాజేష్, రామకృష్ణ, కుమార్, గిరి,సుమన్, మణికంఠ, శ్రీశైలం, వెంకటేష్ తదితరులు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా గోపన్ పల్లిలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీలో నూతనంగా చేరిన వారిని పార్టీ కండువాలతో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి అనేక మంది బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అతి తక్కువ కాలంలోనే చేసి చుపించిందని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరువ చేస్తున్నామని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శేఖర్, ప్రభాకర్, ప్రకాశ్ , మహేష్, రమేష్, రంగస్వామి, చిన్న, నర్సింగ్ రావు, శ్రీకాంత్, మధు, నరసింహ ,గోవర్ధన్, సింధు, విష్ణు,సురేష్,శంకర్ స్థానిక నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :