Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మరోసారి బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి హ్యాట్రిక్ విజయం నమోదు చేయడం ఖాయమని గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం జోరుగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మొదట స్థానికంగా ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన సాయిబాబా అనంతరం రాయదుర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Also Read : శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో అక్రమాలు
ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ భారీ మెజారిటీ తో విజయం సాధించడం ఖాయమని అన్నారు. నేడు తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని, రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి, ఎన్నికల్లో తమ అభ్యర్థి కి భారీ ఆధిక్యాన్ని అందజేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ అధ్యక్షుడు చెన్నం రాజు, వార్డ్ మెంబర్లు రాగం జంగయ్య యాదవ్, దారుగుపల్లి నరేష్, సతీష్ ముదిరాజ్, అంజమ్మ, ఏరియా కమిటీ మెంబర్లు రాజు ముదిరాజ్, అశోక్ యాదవ్, జగదీశ్ లతో పాటు బూత్ ఇంచార్జిలు, బూత్ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Ekaburu