Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడలో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ గచ్చిబౌలి డివిజన్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించిన సాయిబాబా చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Also Read : ఎలుకలు పట్టే ఉద్యోగం... ఏడాదికి రూ.1.2 కోట్ల జీతం..
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మరోసారి బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి హ్యాట్రిక్ విజయం నమోదు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నేడు తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని, రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి, ఎన్నికల్లో తమ అభ్యర్థికి భారీ ఆధిక్యాన్ని అందజేస్తామని అన్నారు.
అంతకుముందు నానక్ రాంగూడ ప్రభుత్వ పాఠశాల వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Ekaburu