Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ డివిజన్ జాగృతి కాలనీలో కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ఆదివారం ప్రారంభించారు. కాలనీ అసోసియేషన్, కాలనీ వాసుల ఆధ్వర్యంలో 30లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను కార్పొరేటర్లు హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ జాగృతి కాలనీ వాసులు స్వంత నిధులతో 30 లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటి హాల్ ను ప్రాంభించుకోవడం సంతోషకరమైన విషయమన్నారు.
Also Read : రాడిసన్ హోటల్ పై చర్యలకు సిద్ధమైన పోలీసులు
కమ్యూనిటీ హల్ నిర్మాణం కోసం ముందుకు వచ్చిన జాగృతి కాలనీ వాసులు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారన్నారు. భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. అందుబాటులోకి వచ్చిన కమ్యూనిటీ హాల్ ను కాలనీ వాసుల సంక్షేమం కోసం ఉపయోగించుకోవాలని అన్నారు. జాగృతి కాలనీ అభివృద్ధి కోసం తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, కాలనీ వాసులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుపతి, శ్రీనివాస్, జాగృతి కాలనీ వాసులు రామకృష్ణ, వాసు, చంద్రశేఖర్, రతన్, శ్రీనివాస్, అమర్, తేజలతో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.
Admin
Ekaburu